సూయి దాగాను ప్రశంసించిన స్మృతి

ముంబయి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మత్రి ఇరానీ ‘సూయి ధాగా’ చిత్రాన్ని ప్రశంసించారు. బాలీవుడ్‌ నటులు అనుష్క శర్మ, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సూయి ధాగా’. శరత్‌ కటారియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ కాన్సెప్ట్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ సినిమాను మంత్రి స్మత్రి ఇరానీ ప్రశంసిస్తూ భారతీయ దుస్తులను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ఎక్కడి దుస్తులకు అక్కడి పేరు. కేవలం మన దుస్తులను చేతులతో నేస్తూ వారి కలలను సాకారం చేసుకునేవారు మన దేశంలో ఎంత మంది ఉన్నారు? ‘సూయి ధాగా’ చిత్రం మన భారతీయ దుస్తులకు మేక్‌ ఇన్‌ ఇండియా పేరుతో ప్రచారం కల్పిస్తుంది. చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో పేర్కొంటూ చిత్ర ట్రైలర్‌ను పంచుకున్నారు. ప్రతిష్ఠాత్మక యష్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన అనుష్క ఈ చిత్రంలో గ్రావిూణ యువతిగా నూలు చీరల్లో కనిపించడం కొత్తగా ఉంది. వరుణ్‌ ధావన్‌ కూడా తొలి సారి విూసాలతో విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తున్నాడు. సెప్టెంబరు 28న ఈ చిత్రం విడుదలవుతోంది.