సెల్ టవర్ ఎక్కిన టీఆర్ఎస్వీ విద్యార్థులు
హైదరాబాద్:కూకట్పల్లిలోని ఓ సెల్టవర్పైకి ఎక్కిన టీఆర్ఎస్వీ విద్యార్థులు నిరసన నినాదాలు చేశారు. సిరిసిల్లలో విజయమ్మ ఒక్క రోజు దీక్షకు నిరసనగా వారు ఈ నిరసనకు దిగారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా విజయమ్మ సిరిసిల్లలో పర్యటించేది లేదని వారు డిమాండ్ చేస్తోన్నారు. ఈనెల 23న విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు నిర్ణయించిన విషయం తెలిసిందే.