సేవా రత్న అవార్డు అందుకున్న చిలువేరు స్వామి జనంసాక్షి, రామగిరి :

హైదరాబాదులోని శాంతి ఆడిటోరియంలో ఆదివారం రాత్రి ఎల్దర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ వారు 18 సంవత్సరాల సెలబ్రేషన్ నిర్వహించారు. అందులో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు గుర్తించి వారిని అవార్డులతో సత్కరించారు. ఇందులో భవన నిర్మాణ కార్మికుల సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి కి సేవా రత్న అవార్డును రిటైర్డ్ హైకోర్టు జడ్జీలు డాక్టర్ జి. చంద్రయ్య, ఎంకేఎస్ జస్వాల్ , ఫౌండర్ సూర్య నారాయణ శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందించారు.