సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలి

ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో నిర్వహించే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలని డిఈఓ అశోక్ అన్నారు.గురువారం ఏవీఎం పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ పై సన్నాహక సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అన్ని పాఠశాలల విద్యార్థులు హాజరవుతున్నందున అన్ని ఏర్పాట్లు , సౌకర్యాలు కల్పించాలన్నారు.సైన్స్ ఫెయిర్ నిర్వహణకు 20 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎవరికి కేటాయించిన విధులను ఆ కమిటీ వారు సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.ఈ సదస్సులో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని తగు సూచనలు చేశారు.ఈ సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి దేవరాజు, సెక్టోరియల్ అధికారి శ్రవణ్ , ఏసిఈ సీనయ్య , ఎంఈఓ సలీం షరీఫ్, ధారాసింగ్, హెచ్ఎంలు జెల్లా ప్రసాద్, దామెర శ్రీనివాస్, శంకర్ నాయక్, పద్మ , వసరాం , ప్రకాష్ , వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.