సొంతగూటికి చేరిన వేళ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు బషీరాబాద్

సెప్టెంబర్ 25, (జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని సోమవారం రోజున నీళ్లపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో డాక్టర్ బి.సంపత్ కుమార్,బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అర్బిఎల్ బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమని, అందుకు శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శంకరప్ప,కాంగ్రెస్ పార్టీ యాలాల మండల్ మాజీ అధ్యక్షులు బీమప్ప,తాండూర్ నియోజకవర్గం టీపీసీసీ కోఆర్డినేటర్ నరేష్ వాల్మీకి, మండల కోఆర్డినేటర్ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్,నర్సిములు,శాను,జలల్ పూర్ శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.