సొసైటీలో హరితహారం కార్యక్రమం

జూలూరుపాడు, జులై  , జనంసాక్షి:
జులూరుపాడు సహకార సంఘం కార్యాలయంలో గురువారం హరితహరం కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు లేళ్ళ వెంకటరెడ్డి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు చీమలపాటి భిక్షం, డైరెక్టర్లు కొమ్మినేని పాండురంగారావు, భూక్యా జవహర్ లాల్, మనుబోలు తిరువెంగళరాజు, పాపిన్ని వెంకయ్య, లకావత్ హేమ్లా, సంఘం సిబ్బంది పాల్గొన్నారు.