సోనియా ఇంటివద్ద తెలంగాణ సెగ

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం ఢిల్లీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగుతుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా నివాసం వద్ద తెలంగాణ సెగలు పొగలు కక్కుతున్నాయి. డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇక్కడి తెలంగాణ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ 10 జనపథ్‌లోని సోనియా ఇంటివైపు దూసుకుపోయేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నాని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సోనియా నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తెలంగాణ విద్యార్థులపై విచక్షణ రహితంగా లాఠీఛార్జీ చేశారు. పలువురు తెలంగాణ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారని సమాచారం తెలిసింది.