సోనియా, రాహుల్‌ రూ.16 వందలు కోట్లు కొట్టేశారు

స్వామి సంచలన ఆరోపణ
న్యూఢిల్లీ :కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మీదా, రాహుల్‌గాంధీ మీద జనతా పార్టీ అధినేత సుబ్రమణ్యస్వామి అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరు కలిసి 1600కోట్ల రూపాయాలు విలువచేసే అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. వేలకోట్ల విలువచేసే భూముల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న వీళ్లద్దరిమీదా కంపనీ వ్యవహారాలశాఖ, సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరిపించి కేసులు పెట్టాలని సుభ్రమణ్యస్వామి డిమాండ్‌ చేశారు. యంగ్‌ ఇండియా అనే సంస్థలో సోనియాకి, రాహుల్‌కి చెరో 38శాతం వాటాలున్నాయని, ఎఐసీసీ కోశాధికారి మోతిలాల్‌వోరా చైర్మన్‌గా ఉన్న అసోసియేట్‌ జర్నల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ని సోంతం చేసుకోవటం ద్వారా పత్రికా ప్రచురణతో ఎలాంటి సంబంధంలేని యంగ్‌ ఇండియాని హస్తగతం చేసుకున్నారని, ఈ కంపెనీని అడ్డంపెట్టుకుని కోట్లాది రూపాయాల విలువైన భూముల్ని అప్పనంగా కోట్టేశారని జనతా పార్టీ అధినేత సుబ్రమణ్యస్వామి మండిపడుతున్నారు.