“సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్”గా కొణతం దిలీప్


మరో నాలుగు అవార్డులు కైవసం చేసుకున్న ఐటీ శాఖ తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం

హైదరాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిఆర్ సిఐ) ఎక్సలెన్స్ అవార్డులను ఐదు విభాగాలలో గెలుచుకుంది. న్యూఢిల్లీలో గురు, శుక్ర వారాల్లో జరిగిన 17వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ లో ఈ అవార్డులను ప్రదానం చేశారు. మాజీ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చేతుల మీదుగా డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం “సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును పీఆర్సీఐ అందజేస్తుంది. ఈ అవార్డుతో పాటు, డిజిటల్ మీడియా విభాగం 2023 సంవత్సరానికిగాను మరో నాలుగు పీఆర్సీఐ ఎక్సలెన్స్ అవార్డులను గెలుచుకుంది.

1) సోషల్ మీడియా ఉత్తమ వినియోగం అవార్డు
2) ఉత్తమ వార్షిక నివేదిక అవార్డు (తెలంగాణ ఐటీ శాఖ వార్షిక నివేదిక 2022-23కి)
3) ప్రజా సేవల ప్రకటనల అవార్డు (“మన ట్యాంక్‌బండ్‌ని శుభ్రంగా, అందంగా ఉంచుకుందాం” వీడియోకి)
4) ఉత్తమ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్స్ (“కాళేశ్వరం -తెలంగాణ జల విప్లవం” వీడియోకి)
తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరపున సహాయ సంచాలకులు, డిజిటల్ మీడియా ముడుంబై మాధవ్, డిజిటల్ మీడియా కన్సల్టెంట్ నరేందర్ గుండ్రెడ్డి ఈ అవార్డులు అందుకున్నారు.