స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ పునఃప్రారంభం

వాషింగ్టస్‌: అమెరికా ప్రతిష్ఠాత్మక చిహ్నమైన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని పర్యాటకుల సందర్శనకు అనుమతిచ్చారు. శాండీ తుపాను సంభవించిన అనంతరం పర్యాటకులను అనుమతించడం ఇదే మొదటిసారి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు, చరిత్రకు చిహ్నమైన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని భారీ ర్యాలీతో ఘనంగా ప్రారంభించారు. గత ఏడాది అక్టోబర్‌ 29న సంభవించిన భీకర శాండీ తుపాను కారణంగా ధ్వంసమైన నగరాన్ని తొమ్మిది నెలల్లోనే పునరుద్ధరించారు.