స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం……

టేకుమట్ల.అక్టోబర్07(జనంసాక్షి)మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఈటూరు శంకర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా 1999-2000 పదవ తరగతి స్నేహితులు మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో  దాసరి కుమారస్వామి,వంగ నరేష్, మహమ్మద్  రహీమ్ పాషా, కొల్గూరి రాజేందర్,శ్రీనివాస్, మహేందర్,సదానందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.