స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకుజాతీయ గీతాలాపన

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో కలెక్టరేట్ లోని అన్నీ కార్యాలయాల అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విధ్యార్ధులు, సామూహిక జాతీయ గీతాలాపన ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో బాగంగా ఈ రోజు జిల్లాలో ఒకే సమయంలో నగర, పట్టణ, గ్రామ, ఆవాస కూడలలో , సినిమా హాలులలో అన్నీ వర్గాల వారు స్వచ్చందంగా సామూహిక జాతీయ గీతాలాపన చేయడం జరిగిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కృష్ణ రెడ్డి, పిడి డి ఆర్ డి ఏ యం.ఉపేంధర్ రెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణ రెడ్డి, జిల్లా కొ-ఆపేరేట్యివ్ అధికారి పరిమళ దేవి ,జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి పి.యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, , ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవిన్ కుమార్, కలెక్టరేట్ ఏ ఓ నాగేశ్వర చారి, సిపిఓ మాన్య నాయక్, అందరూ జిల్లా అధికారులు, అన్ని కార్యాలయాల సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు , విధ్యార్ధులు, ఎక్సైజ్ సిబ్బంది , పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు