స్వతంత్ర భారత స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలి;

మునిసిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ ఆగస్టు 13 ( జనంసాక్షి )
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని  కోదాడ పురపాలక సంఘం పరిధి లో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ కార్యక్రమాన్ని జండా ఊపి ప్రారంభించిన వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
ఈ ర్యాలీ లో ప్రజా ప్రతినిధులు,నాయకులు,
మునిసిపల్  అధికారులు,సిబ్బంది,పోలీస్ శాఖ వారు,
రెవిన్యూ శాఖ వారు,ప్రభుత్వ దుకాణాల వారు,రైతు కమిటీ వారు,ప్రజలు,ఉద్యోగులు, విద్యార్థులు,స్వచ్ఛంద సంస్థల వారు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని  ప్రధాన రహదారి పై నిర్వహించిన భారీ జాతీయ పతాకాల ప్రదర్శన తో కూడిన ర్యాలీ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళతో కలిసి నడిచిన చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి,ఆర్డీఓ కిషోర్ కుమార్, కమిషనర్ మహేష్ రెడ్డి,ఎంఈఓ సలీం షరీఫ్,మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి, కోదాడ ఎంపీపీ చింత కవిత,టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు,పార్టీ శ్రేణులు,పట్టణ కౌన్సిలర్స్ గుండపునేని పద్మావతి నాగేశ్వర రావు,పెండెం వెంకటేశ్వర్లు,షేక్ మాదార్ సాహెబ్,బానోతు రమణ నాయక్,తిపిరిశెట్టి సుశీల రాజు,దారవత కైలా స్వామి నాయక్,ఇతర కౌన్సిల్లోర్స్,తెరాస నాయకులు రామినేని సత్యనారాయణ,సైదయ్య పాల్గొన్నారు.