స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు మల్కాజిగిరి చౌరస్తా లో ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమానికి మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నంది
కంటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.భారతదేశంలో తొలి మహిళా ప్రధానమంత్రిగా దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని మనమందరం ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈకార్యక్రమంలో నరసింగరావు,వెంకటేష్,జీడి శ్రీనివాస్ గౌడ్,గుత్తి రామచందర్,గౌస్,రాములు, వినోద్ యాదవ్,అలీభాయ్,వంశీ ముదిరాజ్,శంకర్,శ్రీనివాస్,నగేష్,ఫరీద్, ఆశ,స్వప్న,నరసింహ గౌడ్,మహేందర్ గౌడ్,నరేందర్ గౌడ్,మిట్టల్,రాజు, ఉదయ్,ప్రవీణ్,యాదగిరి,రాములు తదితరులు పాల్గొన్నారు.