స్వాతంత్ర ఉద్యమంల చురుకుగా పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కృషి చేయాలి. – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

స్వాతంత్ర ఉద్యమంల చురుకుగా పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కృషి చేయాలి. – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 జనం సాక్షి.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణా ఉద్యమ కారకులు, స్వాతంత్ర్య ఉద్యమములో చురుకుగా పాల్గొన్నారని, అయన ను స్పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఐ డి ఓ సి నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.వారి సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.1969వ సంవత్సరంలో తొలి దశ పోరాటం లోనే కీలక పాత్రా పోషించి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా దీక్షను చేయడమే కాకుండా తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమానికి అండగా నిలిచిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన యోధుడు ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ తనకంటూ ఏమి లేకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సమావేశాలు ఏర్పాటు చేసుకొనుటకు తన యొక్క ఆస్తులు మొత్తం కూడా దానం చేసిన త్యాగశీలి, ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు, బడగు బలహీన వర్గాలు అభివృద్ది చేందాలని ఆశించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలను అధికారికంగా జరపడం సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్, బి సి సంక్షేమ అధికారి శ్వేత ప్రియదర్శిని, జిల్లా అధికారులు , ఏ ఓ బద్రప్ప , పద్మ శాలి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.