హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ అరెస్ట్
హీరా గ్రూపులో ఉగ్రవాదుల డిపాజిట్లు..!
చిత్తూరు,జనవరి3(జనంసాక్షి): హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ను గురువారం ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను చిత్తూరు కోర్టులో హాజరు పర్చారు.గొలుసు కట్టు వ్యాపారం కేసులో నిందితురాలిగా ఉన్న హీరా గ్రూపు సంస్థల అధినేత నౌహీరా, ఈ గొలుసుకట్టు వ్యాపారం పేరుతో దేశ వ్యాప్తంగా డిపాజిట్లు సేకరించి కోట్ల రూపాయలు ఆమె స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొటుంది.హీరా గ్రూపులో ఉగ్రవాదుల డిపాజిట్లు సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణకు సీఐడీ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సహకారం కోరినట్లు తెలుస్తోంది. ఎనిమిది విదేశీ బ్యాంకు ఖాతాల్లో రూ.వందల కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. హీరా గ్రూపు కుంభకోణం విలువ రూ.8 వేల కోట్లకు పైగా ఉన్నట్లుగా పోలీసులు అంచనా వేశారు. మరోవైపు హీరా గ్రూపు ఫెమా నిబంధనలు కూడా ఉల్లంఘించి, నిధులను అక్రమంగా తరలించినట్లు సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు.