హైదదాబాద్లో సౌత్ ఇండియా బ్యాంక్ సేవలు ప్రారంభం
హైదరాబాద్: సౌత్ ఇండియా బ్యాంక్ తన తొలి కార్పోరేట్ బ్రాంచిని హైదరాబాద్లో ప్రారంభించింది. మంత్రి టీజీ వెంకటేశ్, సౌత్ ఇండియా బ్యాంక్ ఎండీ జోసెఫ్ బ్యాంక్ను ప్రారంభించారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయుల కోసం ఆయా దేశాల్లో తమ సేవలను విసృతం చేయనున్నట్లు జోసెఫ్ వెల్లడించారు. ఈ ఏడాది చివరకు విదేశీ శాఖల్ని ఏడుకు పెంచనున్నట్లు అన్నారు. విదేశాల్లో తమకు 3 లక్షల మంది ఖాతాదారులు ఉన్నట్లు తెలియజేశారు.