హోంవర్క్‌ చేయలేదు అన్ని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

హైదరాబాద్‌: విద్యార్థులను దండించవద్దని ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా కొంతమంది ఉపాధ్యాయులు పెడచెవిన పెడుతున్నారు. హోంవర్క్‌ చేయనందుకు  ఓ విద్యార్ధిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటక కృష్ణానగర్‌ శ్రీసాయిరాం పాఠశాలలో చోటుచేసుకుంది. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆసుప్రతికి తరలించారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, స్థానికులు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.