10న బాబు ఢిల్లీకి
అమరావతి,డిసెంబర్8(జనంసాక్షి): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10న ఢిల్లిలో పర్యటించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ సహా మిత్రపక్షాలతో చంద్రబాబు భేటీ కానున్నారు. సమావేశానికి బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన ఏడుగురు సీఎంలు, 10కి పైగా జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు హాజరవుతారని టీడీపీ వర్గాలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు వివిధ జాతీయ నేతలతో చంద్రబాబు సంప్రదింపులు జరపనున్నారు. భేటీకి కాశ్మీర్కు చెందిన పీడీపీని ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా భేటీకి మాయావతి వస్తున్నారా? లేదా ? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.