10 నిమిషాలు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ పది నిమిషాలు వాయిదా పడింది. సభ ప్రారంభమైన కిద్ది సేపటికే బొగ్గు కుంభకోణానికి సంబంధించి దస్త్రాల గల్లంతుపై ప్రధాని ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.