108 లో ప్రసవించిన గర్భిణీ – తల్లీబిడ్డ క్షేమం

108 లో ప్రసవించిన గర్భిణీ – తల్లీబిడ్డ క్షేమం

 

కోటగిరి సెప్టెంబర్ 23 జనం సాక్షి:-కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన స్వర్ణ రెండవ కాన్పు నిమి త్తం కోటగిరి సిఎచ్సి కేంద్రానికి శనివారం ఉదయం వచ్చింది.కోటగిరి వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించి వెంటనే బోధన్ డిజిఎచ్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని చెప్పగా వెనువెంటనే వారు కోటగిరి 108 వాహనం లో బోధన్ కి తరలిస్తుండగా మార్గమద్యలో ఆమెకు నొప్పులు అధికం కావడంతో వాహన సిబ్బంది ఈఎం టి శివ కుమార్,పైలట్ కలీం పాషా ప్రాథమిక చికిత్స చేసి సుఖప్రసవం చేయగా ఆమె పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది.తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో వారిని బోధన్ ఆస్పత్రిలో చేర్పించారు.ఈ సందర్భంగా 108 సిబ్బందిని స్వర్ణ కుటుంబ సభ్యులు పలువురు అభినందించారు.