ముంబైలో 11 చోట్ల ఉగ్రదాడులకు ఇండియన్ ముజాహిదీన్ ప్లాన్ :ఉగ్రవాది యాసీన్ భత్కల్ వెల్లడి
ముంబై : ఇండియన్ ముజాహిదీన్ ..ఈపేరు వింటే చాలు ముంబై ఉగ్రదాడులు కళ్ల ముందు కదలాడుతాయి.అలాంటి ఉగ్రవాద సంస్ధ గత నెలలో ముంబై మహానగరంలో 11 చోట్ల మళ్లీ దాడులు చేసేందుకు రెక్కి నిర్వహించింది.ఈ విషయాన్ని ఇటీవలే అరెస్టయిన ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాది యాసీన్ భత్కల్ వెల్లడించాడు. దాంతో మహారాష్ట్ర పోలీసులు ముంబైలో ఒక్కసారిగా భద్రత కట్టుదిట్టం చేశారు.ఈమేరకు మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ రాకేష్ మారియా సంతకం చేసిన ఓ రహస్య నివేదికలోని విషయాలు వెల్లడయ్యాయి.