ఇరాక్ లో 118 మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్లో దేశవ్యాప్తంగా నిన్న జరిగిన బాంబు పేలుళ్లలో ఒక మిలిటరీ జనరల్తో సహా 18 మంది మరణించారు. మోసూల్ పట్టణం లో జరిగిన ఆత్మాహుతి దళం దాడిలో బ్రిగేడియర్ జనరల్తో పాటు ఎనిమిది మంది సైనికులు మృతి చెందినట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. 2006-07లో రెండు వర్గాల మధ్య అల్లర్లు మొదలైనప్పటి నుంచి దేశంలో హింస పెచ్చరిల్లుతూనే ఉంది. ఈ ఒక్క ఏడాదే దాదాపు 8వేల వరకు మృత్యువాతపడినట్లు సమితి వర్గాలు పేర్కొన్నాయి.