12 స్థానాలు గెలిచే సత్తా ఉంది

2
– కె.కెేశవరావు

– ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి):  తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలనూ గెలిచే సామర్థ్యం తెరాసకు ఉందని ఆ పార్టీ నేత కె.కేశవరావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు గురించి చర్చించలేదని అన్నారు. నిజామాబాద్‌ అభ్యర్థిగా భూపతిరెడ్డి, నల్గొండ-తేరా చిన్నపరెడ్డి, ఖమ్మం-బాలసాని లక్ష్మీనారాయణలను అభ్యర్థులుగా ప్రకటించారు. మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారని త్వరలోనే వారి పేర్లను ప్రకటిస్తామన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో జరుగనున్న స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పురాణం సతీష్‌, కరీంనగర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూపాల్‌ రెడ్డిని పార్టీ ప్రకటించింది. ఇప్పటికే ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ, నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూపతిరెడ్డి, నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నప్ప రెడ్డి పేర్లను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.