మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడిన రాజ్యసభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ప్రకటించారు. టీడీపీ ఎంపీల తీరుపై అన్సారీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.