లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాబర్ట్ వాద్రా భూ అక్రమాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టడం, రాష్ట్రాన్ని విభజించొద్దని కోరుతూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగారు. గందరగోళ పరిస్థితుల మధ్య ప్రశ్నోత్తరాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.