12 గంటల వరకు వాయిదా పడిన లోక్సభ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు సభల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. టీడీపీ ఎంపీలు నల్ల టోపీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇరు పార్టీల ఎంపీలు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ నెలకొంది.