మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్సభ వాయిదా
ఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సభలో విపక్షాలు ఆందోళన చేయడంతో స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. సభలో టీడీపీ ఎంపీలు సందీప్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. బొగ్గు స్కాం ఫైళ్ల గల్లంతుపై ప్రధాని సమాధానం ఇవ్వాలని బీజేపీ ఎల్పీ నేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.