ఉభయ సభలు మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా

ఢిల్లీ: విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్‌ సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ప్లకార్డులతో లోపలికి వెళ్ళి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో స్పీకర్‌ సభను వాయాదా వేశారు.