13,653 మెగావాట్ల విద్యుత్‌ లోటు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్‌ పరిస్థితి 15 రోజుల్లో మెరుగుపడుతుందని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సునిల్‌కుమార్‌ షిండే చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ కొరతతో అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితిల్లో షిండే వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ”దేశంలో విద్యుత్‌ కొరత ఉన్నమాట వాస్తవమే. ఇది వేసవి కాలం. ఢిల్లీ, ఇతర పెద్ద నగరాలపై ఆ ప్రభావం పడింది. రాబోయే 15 రోజుల్లో పరిస్థితి కచ్చితంగా మెరుగుపడుతుంది.” అని బుధవారమిక్కడ విలేకర్లతో చెప్పారు. విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి కేసీ వేణుగోపాల్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. తాజా గణాంకాల మేరకు దేశంలో 13,653 మెగావాట్ల విద్యుత్‌ లోటు ఉంది.