14 మంది ట్రక్కు డ్రైవర్ల కాల్చివేత

బాగ్దాన్‌: ఇరాక్‌లో సాయుధ మిలిటెంట్ల ఘాతుకాలు కొనసాగుతున్నాయి. కొంతమంది సాయుధులు బాగ్దాద్‌ నుంచి కిర్కుక్‌ వెళ్లే ప్రధాన మార్గంపై నకిలీ చెక్‌పాయింట్‌ను ఏర్పాటుచేసి ఆ దారిలో వెళ్లిన ట్రక్కులన్నిటినీ ఆపి డ్రైవర్లను కాల్చివేసి ట్రక్కులతో పరారైనట్లు తెలుస్తోంది. రంజాన్‌ మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారుల లెక్కల ప్రకారం ఇరాక్‌లో హింసాత్మక ఘటనల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారు.