ముజఫర్నగర్ అల్లర్లలో 14కు చేరిన మృతులు
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో చోటు చేసుకున్న అల్లర్లలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం రెండు వర్గాల మద్య ఘర్షణలో తొమ్మిది మంది మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు.ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం ఇద్దరు మృతి చెందారు. మద్యాహ్నం మరో ఇద్దరు మృతి చెందారు.దీంతో మృతుల సంఖ్య 14కు చేరింది.యూపిలో ప్రత్యేక బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.