ప్రమాద సమయంలో బస్సు వేగం 140-150 కి.మీ

బెంగళూరు : కర్ణాటకలోని హవేరి సమీపంలో వోల్వో బస్సులో మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సు గంటకు 140 నుంచి 150 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు సమాచారం. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో టైరు పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది.