15తులాల బంగారం చోరి

కొండపాక: మండలంలోని దుద్దెడ గ్రామంలో చోరి జరిగింది. నిన్న రాత్రి గున్నాల వెంకటేష్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.5లక్షల విలువచేసే 15తులాల బంగారం, వెండి నగలు దోచుకెల్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.