15 నుంచి ఒంటి పూట పెట్రోల్‌ బంకులు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13 (జనంసాక్షి): ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయని పెట్రోలియం డీలర్లు శనివారం తెలిపారు.  అపూర్వ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ కోసం ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పెట్రోల్‌ విక్ర యాలు కొనసాగుతాయన్నారు.  ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకే పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయ న్నారు. అలాగే జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌ బంకులు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు విక్రయాలు కొనసాగుతాయని వివరించారు. డిమాండ్‌ సాధించేంతవరకు తమ నిరసన కొనసా గుతుందని చెప్పారు.