బస్సు లోయలో పడి 15 మంది మృతి
సిమ్లా : హిమాచల్ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఓ మిని బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 15మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఖజానా రామ్ శుక్రవారం వెల్లడించారు. ఆ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.