150 మీటర్ల జాతీయ జెండాతో వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రదర్శన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో ఆగస్టు 22. (జనం సాక్షి). 75వ స్వాతంత్ర వజ్రోత్సవ దినోత్సవ వేడుకలనువికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సోమవారం 150 మీటర్ల జాతీయ జెండాతో భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమనికి హాజరైన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తిని అందించేలా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిందని అన్నారు. కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్అకుకునురి శంకరయ్య, దిడ్డి శ్రీనివాస్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.