పోలీసులకు ఫిర్యాదు చేసిన పిఎ
న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఢల్లీిలోని మహబూబ్నగర్ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సౌత్ అవెన్యూలోని ఆయన నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, మహబూబ్ నగర్కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పీఏ రాజు మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అపహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిపై మున్నూరు రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
- భట్టి తీవ్ర మనస్తాపం
- ఢిల్లీలో మళ్లీ క్షీణించిన గాలి నాణ్యత
- మరింత దిగువకు రూపాయి
- దావోస్లో పెట్టుబడుల వరద
- రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలి
- మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి
- ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక ‘జనంసాక్షి’
- భారత్తో వాణిజ్య ఒప్పందం.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ` ఈయూ చీఫ్
- గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుని తీరతాం
- పసిడి,రజతానికి రెక్కలు
- మరిన్ని వార్తలు


