పోలీసులకు ఫిర్యాదు చేసిన పిఎ
న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఢల్లీిలోని మహబూబ్నగర్ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సౌత్ అవెన్యూలోని ఆయన నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, మహబూబ్ నగర్కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పీఏ రాజు మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అపహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిపై మున్నూరు రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు