పోలీసులకు ఫిర్యాదు చేసిన పిఎ
న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఢల్లీిలోని మహబూబ్నగర్ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సౌత్ అవెన్యూలోని ఆయన నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, మహబూబ్ నగర్కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పీఏ రాజు మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అపహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిపై మున్నూరు రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
- రైతుల కోసం సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
- ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
- గజసింగవరంలో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
- పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం
- రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
- మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి
- స్విమ్మింగ్ పూల్ లోతల్లి ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
- ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు
- మరిన్ని వార్తలు


