పోలీసులకు ఫిర్యాదు చేసిన పిఎ
న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఢల్లీిలోని మహబూబ్నగర్ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సౌత్ అవెన్యూలోని ఆయన నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, మహబూబ్ నగర్కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పీఏ రాజు మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అపహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిపై మున్నూరు రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- హైడ్రాకు ఫుల్పవర్స్
- సింగరేణి కార్మికులకు తీపికబురు
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి ఊరట
- వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరిన్ని వార్తలు