16మంది ఎర్రదొంగల అరెస్ట్‌

కడప,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): రాయచోటి రూరల్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో 16 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం రాయచోటి ఎస్‌పి బి.లక్ష్మీ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ.. వారం క్రితం రాయచోటి రూరల్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ దాడుల్లో పట్టుకున్న ముద్దాయిలను విచారించి .. తిరిగి అదే ప్రాంతంలో దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన దాడుల్లో అత్యంత ముఖ్యులైన ఎర్రచందనం స్మగ్లర్లు అయ్యప్ప, పనలార్సన్‌, ఈశ్వరయ్య, సురేశ్‌లు పట్టుబడ్డారని చెప్పారు. ఈ నలుగురు స్మగ్లర్లపై తమిళనాడు, ఆంధ్రాలో ఇదివరకే కేసులున్నాయని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన పోలీసు దాడుల్లో మొత్తం 16 మంది ఎర్రచందనం స్మగ్లర్లను, 50 ఎర్రచందనం దుంగలను, 2 వాహనాలను స్వధీనం చేసుకొన్నామన్నారు. స్మగ్లర్లను

విలేకరుల ముందు హాజరుపరిచి, దుంగలను చూపి ఎస్‌పి బి.లక్ష్మీనారాయణ వివరాలన్నీ వెల్లడించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల బరువు 794 కిలోలని ఎస్‌పి పేర్కొన్నారు.