164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌

బులవాయో: భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో టీంఇండియా బౌలర్ల ధాటికి జింబాబ్వే చేతులెత్తేసింది. 39.5 ఓవర్లలో 163 పరుగులకు అలౌట్‌ అయింది. జింబాబ్వే జట్టులో విలియమ్స్‌ 51, మనకడ్డా 32 పరుగులు చేయగా… మిగతా వారు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మిశ్రా 6 వికెట్లు తీయగా… శర్మ, ఉనద్కత్‌, జడేజా, షమి తలో వికెట్‌ తీశారు. 164 పరుగుల విజయలక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగింది.