17వ రోజున కొనసాగిన అంగనవాడి ఉద్యోగుల సమ్మె

17వ రోజున కొనసాగిన అంగనవాడి ఉద్యోగుల సమ్మె

టేకులపల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి ): 17వ రోజు టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ నిరవధిక సమ్మె బుధవారానికి కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్ గా పర్మినెంట్ చేయాలని వారి సెంటర్లో హెల్పర్లను నియమించాలని అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని హెల్పర్లకు ఐదు లక్షల ఇవ్వాలని తదితర డిమాండ్లతో నిరసన తెలియజేస్తు మా పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సిఐటియు జిల్లా నాయకురాలు వై ఇందిరా కొండపల్లి శకుంతల వై పద్మావతి వి సంధ్యారాణి ఎన్ విజయలక్ష్మి ఎం నాగమణి టి వరమ్మ వి రాజేశ్వరి కల్తీ భద్రమ్మ కే రాజేశ్వరి ఐ రాధా తదితరులు పాల్గొన్నారు.