171కి చేరిన ఫిలిప్సైన్‌ భూకంపం మృతుల సంఖ్య

మనీలా : ఫిలిప్సైన్‌లో మంగళవారం సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 171కి చేరింది. ఇంకా 20 మంది ఆచూకి తెలియాల్సీ ఉంది. మనీలాకి 640 కి.మీ దూరంలో ఉన్న బోహోల్‌ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. భూకంపం తాలూకూ పరిణామాల్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు ఇప్పటికీ పునరావాస శిబిరాల లోపల ఉండడానికి ఇష్టపడుతున్నారని సహాయ చర్యలు చేపడుతున్న అధికారులు పేర్కొన్నారు. దాదాపు మూడున్నర మిలియన్ల మంది భూకంప బాధితులుగా మిగిలారని ,34 వేల ఇళ్లు నేలమట్టమయ్యయని వారు తెలిపారు.