జలాంతర్గామిలో పేలుడు : 18 మంది గల్లంతు
ముంబాయి: ముంబాయి నావికాదళానికి చెందిన రేవులో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్థరాత్రి భారీ శబ్ధంతో సంభవించిన పేలుడు కారణంగా రేవులో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐఎస్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామి దెబ్బతింది. అందులో ఉన్న ముగ్గురు అధికారులతో సహా 18 మంది గల్లంతయ్యారు. నావల్డాక్ యార్డుతో పాటు, మంబాయి అగ్నిమాపక దళానికి చెందిన అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది. మంటను అదుపు చేశారు. నా చీఫ్ డి.కె జోషి ఘటనాస్థలికి బయలుదేరి వెళ్లారు. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. గల్లంతైనా వారి కోసం నావీ సిబ్బంది గాలింపు చేపట్టారు.