2జీ కేసులో కరుణానిధి భార్యకు వూరట
ఢిల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాల్కు వూరట లభించింది. సుప్రీంకోర్టు ఆమెకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది. 2జీ కేసులో దయాళు అమ్మాల్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు కాంలసి ఉంది. దయాళు అమ్మాళ్ను చెన్నైలోనే విచారించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయవలసిందిగా సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించింది.