లోక్‌సభ మ. 2 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలని సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేశారు. ఎంపీ శివప్రసాద్‌ ఇందిరాగాంధీ మాస్క్‌ ధరించి నిరసన వ్యక్తం చేశారు.