లోక్సభలో 2జీ కుంభకోణం పై జేపీసీ నివేదిక
ఢిల్లీ: 2జీ కుంభకోణం పై వివాదాస్పదమైన జేపీసీ నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టారు. జేపీసీ ఛైర్మన్ పీసీ చాకో దీనిని ప్రవేశపెట్టగానే యశ్వంత్ సిన్హా ,హరీన్ పాఠక్, గురుదాన్ దాన్గుప్తా, కల్యాణ్ బెనర్జీ తదితరులు ఫ్రాడ్ అని అరుస్తూ నిరసన వ్యక్తం చేశారు. డీఎంకే సభ్యులు సభనుంచి బయటకు వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ లోపలికి వచ్చి స్పీకర్ వెల్లోకి దూసుకుపోయి కొన్ని కాగితాలను చించేశారు. దాంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.