2.50 లక్షల రూపాయల ఎల్ ఓ సి ని అందచేసిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 26 జనం సాక్షి.
జోగులాంబ గద్వాల జిల్లా శాంతి నగర్ పట్టణంలో వడ్డేపల్లి మండలం జిల్లేడు దీన్నే గ్రామనికి చెందిన టి .లక్ష్మి దేవమ్మ అనారోగ్యంతో
బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం హైదరాబాదు లోని నిమ్స్ హాస్పటల్ నందు సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చేసుకోగ మంగళవారము 2.50 లక్షల రూపాయల మంజూరు ఎల్ ఓ సి ను బాధిత కుటుంబ సభ్యులకు అందచేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాషపోగు రాజు, ఎంపీపీ రజిత,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,సర్పంచ్ ఆంజనేయులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు