20 న అంగారక టౌన్ షిప్ ప్రీ బిడ్ సమావేశం

– నుస్తులాపూర్ రైతు వేదికలో అక్టోబర్ 20 న ఉదయం 11.00 గంటలకు( అంగారక టౌన్ షిప్) ప్రీ బిడ్ సమావేశం
— జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

తిమ్మాపూర్, అక్టోబర్ 18 (జనం సాక్షి): నుస్తులాపూర్ అంగారక టౌన్ షిప్ లో ప్రీ బిడ్ సమావేశం అక్టోబర్ 20న ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో అంగారక టౌన్ షిప్ లో ఎటువంటి చిక్కులు లేని 656 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం నవంబర్14 నుండి నవంబర్ 25 నుస్తులాపూర్ గ్రామంలోని రైతు వేదిక నందు నిర్వహించబడునని అన్నారు. ఇందులో భాగంగా మొదట ఫ్రీ బిడ్ అక్టోబర్ 20,2022 రోజున తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం రైతు వేదిక వద్ద నిర్వహించబడునని తెలియజేశారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 20న ఉదయం11.00 గంటల వరకు ఇట్టి సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.