21న సడక్బంద్ బెంగళూర్ హైవే దిగ్బంధం
కోదండరామ్
హైదరాబాద్,మార్చి2(జనంసాక్షి):
గతంలో వాయిదా వేసుకున్న ససడక్బంద్ కార్యా క్రమాన్ని తిరిగి ఈ నెల 21న చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఈ నెల 21వ తేదిన హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై సడక్బంద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాజకీయ ఐకాస నిర్ణయించింది. శనివారం తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశమై చర్చిం చింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి దిగ్బంధం తరువాత విజయవాడ రహదారిని దిగ్బంధిస్తామన్నారు. అనంతరం ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిం చనున్నట్టు తెలిపారు.ఞ నడక్బంద్లో శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు భారీ ఎత్తున సడక్ బంద్ను నిర్వహిస్తామని తెలంగాణ జెఎసి తెలిపింది. శనివారం ఉదయం తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ- సమావేశమైంది. సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విూడియాతో మాట్లాడారు. త్వరలోనే పాలమూరు జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు- చేసి సడక్ బంద్పై చర్చిస్తామని తెలిపారు. సడక్ బంద్ నేపథ్యంలో తెలంగాణ వాదులని అరెస్టు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బైండోవర్లకు, అరెస్టులకు జేఏసీ భయపడదని ఆయన చెప్పారు. తెలంగాణకోరుకునే ప్రతి ఒక్కరూ తమతో కలిసిరావాలని కోదండరాం పిలుపునిచ్చారు. లేని పక్షంలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఫిబ్రవరి 24న చేపట్టాల్సిన సడక్ బంద్ను జేఏసీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.శనివారం జరిగిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ- సమావేశానికి బిజెపి నేతలు హాజరు కాలేదు. బిజెపి రాష్టాధ్య్రక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ మండలి సమావేశానికి వెళ్లారు.