అన్నింట విజయాలు ప్రసాదించి విగ్నేశ్వర.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 22 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వినాయక చౌక్ లో ప్రతిష్టాపించిన గణనాథునికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.అదేవిధంగా పలు గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నింటి విజయా లు ప్రసాదించాలని, లంబోధరుని కరుణా కటాక్షా లు నిండుగా సిద్ధించాలని ఆశీర్వదించారు. అనంతరం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలని విగ్నేశ్వరుని ప్రార్థించినట్లు తెలిపారు.హిందూ సంప్రదాయం ప్రకారం మొదటి పూజ వినాయకునికి చేస్తామని అందుకే లంబోదరానికి ఆదిదేవుని గాకొలుస్తార ని తెలిపారు. లంబోధరుని ఆశీస్సులతో తాండూరు ప్రజలంతా సుఖంగా ఉండాలని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని , అన్ని వర్గాల ప్రజలు వ్యాపారులు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకో వాలని సూచించారు ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు భక్తులు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.